నేను రచించిన ‘శ్రీలక్ష్మీనృసింహమాహత్మ్యము’ పద్యకావ్యం 30 జూన్ 2025న హైదరాబద్ నల్లకుంట లోని డి.డి. కాలనీలోని అహోబిలమఠంలో ఆవిష్కరించబడింది.
సంబంధిత నివేదిక సంచికలో ప్రచురితమైంది.
~
కవి తన కావ్యములోని పద్యములను శ్రావ్యముగా గానం చేస్తూ వాటిని వివరించినారు. నృసింహావిర్భావ ఘట్టమును దత్తశర్మ వివరిస్తూండగా, సభికులు భక్తిపరవశులైనారు. వారు ప్రసంగం మొదట ఆలపించిన నృసింహ ధ్యాన శ్లోకము భక్తులను విశేషముగా ఆకట్టుకున్నది. నరసింహ ప్రభువు, భాగవతాగ్రేసరుడైన ప్రహ్లాద కుమారుని దగ్గరకు తీసుకొని, లాలించి ఆశీర్వదించగా, ఆ బాలుడు “పరమాత్మా! రక్తంతో తడిసిన నీ నాలుకను చూసి కరాళ దంష్ట్రలను చూసి, నేను అందరివలె భయలేదు స్వామీ! కానీ
తేగీ:
భయము గల్గును సంసార బంధములను
భయము గల్గును కర్మాను భవము వలన
భయము గల్గును షడ్వర్గ భావనములను
అట్టి భయమును తొలగించు ఆదిపురుష!”
అని వేడుకొన్నాడని, కవి ఆలపించగా, సభికులు పులకించిపోయారు.
~
(పూర్తి నివేదికని సంచికలో చదవగలరు)
https://sanchika.com/srilakshminrusimhamaaahtymaym-book-release-event-report/
No comments:
Post a Comment