Friday, March 14, 2025

నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 18వ భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 18వ భాగం సంచికలో చదవండి.
~
తిరుపాలమ్మకు గ్యాసు స్టవ్ మీద ఎట్లా వంట చేయాలో నేర్పించింది కాశింబీ. జాగ్రత్తలు చెప్పింది. అంతా విని తిరుపాలమ్మ అన్నది గ్యాస్ సిలిండర్‌ను చూస్తూ - “వంటిట్లోనే బాంబు పెట్టుకున్నట్లే గదమ్మా!”
కాశింబీ నవ్వింది! “అదేం లేదులేమ్మా! రెండ్రోజులు పోతే అదే అలవాటయిపోతాది” అంది.
ఆ రోజు కాశింబీనే వంట చేసింది. బుడంకాయ (పుల్ల దోసకాయ) పప్పు, పుండుకూర (గోంగూర) పచ్చడి, మటకాయల (గోరుచిక్కుడు) తాలింపు చేసి, రాములకాయల (టమోటాల)తో చారు చేసింది. ఆ సాయంత్రం సారు, అమ్మ వెళ్లిపోయారు నంద్యాలకు.
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/srimadramaramana-pds-serial-18/

 




పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 25వ భాగం లింక్

కం.:
విద్యలకెల్లను నీవే
ఆద్యుడవో పంకజాక్ష! ఆశ్రితరక్షా!
సద్యోజాతము నీ దయ
అద్యంతము లేని దేవ! ఆత్మస్వరూపా!
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 

https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-25/

 

 



Thursday, March 6, 2025

'దేవీ వైభవం' గ్రంథావిష్కరణ సభకు ఆహ్వానం

కరీంనగర్ భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తేదీ 12 మార్చి 2025 నాడు స్థానిక వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో బ్రహ్మశ్రీ పెండ్యాల కిషన్ శర్మ గారి పద్యకావ్యం 'దేవీ వైభవం' ఆవిష్కరణ జరగనున్నది. నేను ప్రధాన వక్తగా ఉపన్యసించనున్నాను.
ఆహ్వాన పత్రిక చూడండి.


Click on image to view in bigger size
 

బ్రహ్మం గారి మఠంలో శ్రీనాథుని హరవిలాస కావ్యంపై ప్రవచనాలు, సత్కారం

బ్రహ్మం గారి మఠంలో, శివరాత్రి ఉత్సవాలలో, శ్రీనాథుని హరవిలాస కావ్యంపై నా సంగీత ప్రవచనాలు, ఆస్థాన పండితుల వారిచే సత్కారం, శేష వస్త్ర ప్రదానం.
ఓం నమః శివాయ! 🙏🌹







Click on the images to view in bigger size

నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 17వ భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 17వ భాగం సంచికలో చదవండి.
~
వైనతేయకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. పురాణాలు, ఇతిహాసాలు, హరికథలుగా ఎంతో కాలం నుంచి వింటున్నారు ప్రజలు. వారికి కొత్తదనం కావాలి. ప్రెజెంటేషన్‌లో వైవిధ్యం కావాలి. అంతేగాని, హరికథలకు ఆదరణ తగ్గిందనడంతో నిజం లేదు. దీనికి తార్కాణం తాను రూపొందించిన ‘వ్యక్తిత్యశిల్పమే!’.
ఒక ప్రోగ్రాముకు ఇంకో ప్రోగ్రాముకు అతడు పేర్కొనే ఉదాహరణలలో భేదాలుండేవి. తాను చదివిన సాహిత్యం నుండి ఎన్నో దృష్టాంతాలను సేకరించుకున్నాడు. వాటిని వ్యక్తిత్వ వికాసానికి అనుగుణంగా mould చేసుకోసాగాడు.
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/srimadramaramana-pds-serial-17/

 

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 24వ భాగం లింక్

అంత గరుత్మంతుండు వినయాంతరంగుండై వారికి ఎదురేగ
ఉ.:
బంగరు వన్నె కాంతిగల పక్షములన్, అమరాభిమానమున్
రంగరినట్టి దెందమున, రాజితమౌ హరిచందనంబు తోన్
అంగము వెల్గ, భూషణచయంబు చలింప ప్రియంపు మాటలన్
ఇంగిత మొప్ప వారి హరి జేరగ దోడ్కొని పోయె, బ్రీతుడై
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-24/

 

3వ అంతర్జాతీయ తెలుగు భాషా సమావేశాలు 2025 - నివేదిక - లింక్

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తెలుగు అధ్యయన శాఖ, ప్రాచ్య పరిశోధన సంస్థ, తిరుపతి, మరియు ‘తెలుగు సంపద’ బెంగుళూరు వారి సంయుక్త ఆధ్యర్యంలో, ఫిబ్రవరి 27, 28 తేదీలలో 3వ అంతర్భాతీయ తెలుగు భాషా సమావేశాలు అంగరంగ వైభోగంగా జరిగాయి.
మొదటి సెషన్‍లో (27 ఫిబ్రవరి తేదీన) నేను నా పరిశోధనా పత్రాన్ని సమర్పించాను. మొదటగా, కవిసమ్రాట్ విశ్వనాథ విరచితమైన ‘ఒక్క సంగీతమేదో పాడునట్లు, భాషించునపుడు వినిపించు భాష’ అన్న తెలుగు భాషా ప్రాశస్త్యాన్ని వివరించే సీస పద్యాన్ని సుస్వరంగా ఆలపించగా, సభికులు పరవశించి, కరతాళ ధ్వనులు చేశారు.
పూర్తి నివేదికని సంచికలో చదవండి.

 

https://sanchika.com/moodava-antarjaateeya-telugu-bhaashaa-samaavesaalu-2025-nivedika/