కరీంనగర్, జిల్లా సీనియర్ సిటిజన్స్ ఫోరమ్, మరియు జిల్లా పెన్షనర్స్ అస్సోసియేషన్ వారు 12 మార్చ్ 2025 ఏర్పాటు చేసిన సభలో నేను ప్రేరణాత్మక ప్రసంగం చేశాను.
సంబంధిత న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్
Click on images to view in bigger size.
కథా నవలా సాహిత్యం - పద్యాలు - కవితలు - వ్యాసాలు - నాటికలు - కాలమ్స్ - సంగీతం - సినిమాలు - జీవితం!
కరీంనగర్, జిల్లా సీనియర్ సిటిజన్స్ ఫోరమ్, మరియు జిల్లా పెన్షనర్స్ అస్సోసియేషన్ వారు 12 మార్చ్ 2025 ఏర్పాటు చేసిన సభలో నేను ప్రేరణాత్మక ప్రసంగం చేశాను.
సంబంధిత న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్
Click on images to view in bigger size.
డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 18వ భాగం సంచికలో చదవండి.
~
తిరుపాలమ్మకు గ్యాసు స్టవ్ మీద ఎట్లా వంట చేయాలో నేర్పించింది కాశింబీ. జాగ్రత్తలు చెప్పింది. అంతా విని తిరుపాలమ్మ అన్నది గ్యాస్ సిలిండర్ను చూస్తూ - “వంటిట్లోనే బాంబు పెట్టుకున్నట్లే గదమ్మా!”
కాశింబీ నవ్వింది! “అదేం లేదులేమ్మా! రెండ్రోజులు పోతే అదే అలవాటయిపోతాది” అంది.
ఆ రోజు కాశింబీనే వంట చేసింది. బుడంకాయ (పుల్ల దోసకాయ) పప్పు, పుండుకూర (గోంగూర) పచ్చడి, మటకాయల (గోరుచిక్కుడు) తాలింపు చేసి, రాములకాయల (టమోటాల)తో చారు చేసింది. ఆ సాయంత్రం సారు, అమ్మ వెళ్లిపోయారు నంద్యాలకు.
~
(పూర్తి ఎపిసోడ్ని సంచికలో చదవగలరు)
https://sanchika.com/srimadramaramana-pds-serial-18/
కం.:
విద్యలకెల్లను నీవే
ఆద్యుడవో పంకజాక్ష! ఆశ్రితరక్షా!
సద్యోజాతము నీ దయ
అద్యంతము లేని దేవ! ఆత్మస్వరూపా!
~
(పూర్తి ఎపిసోడ్ని సంచికలో చదవగలరు)
https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-25/
కరీంనగర్ భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తేదీ 12 మార్చి 2025 నాడు స్థానిక వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో బ్రహ్మశ్రీ పెండ్యాల కిషన్ శర్మ గారి పద్యకావ్యం 'దేవీ వైభవం' ఆవిష్కరణ జరగనున్నది. నేను ప్రధాన వక్తగా ఉపన్యసించనున్నాను.
ఆహ్వాన పత్రిక చూడండి.
బ్రహ్మం గారి మఠంలో, శివరాత్రి ఉత్సవాలలో, శ్రీనాథుని హరవిలాస కావ్యంపై నా సంగీత ప్రవచనాలు, ఆస్థాన పండితుల వారిచే సత్కారం, శేష వస్త్ర ప్రదానం.
ఓం నమః శివాయ! 🙏🌹
డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 17వ భాగం సంచికలో చదవండి.
~
వైనతేయకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. పురాణాలు, ఇతిహాసాలు, హరికథలుగా ఎంతో కాలం నుంచి వింటున్నారు ప్రజలు. వారికి కొత్తదనం కావాలి. ప్రెజెంటేషన్లో వైవిధ్యం కావాలి. అంతేగాని, హరికథలకు ఆదరణ తగ్గిందనడంతో నిజం లేదు. దీనికి తార్కాణం తాను రూపొందించిన ‘వ్యక్తిత్యశిల్పమే!’.
ఒక ప్రోగ్రాముకు ఇంకో ప్రోగ్రాముకు అతడు పేర్కొనే ఉదాహరణలలో భేదాలుండేవి. తాను చదివిన సాహిత్యం నుండి ఎన్నో దృష్టాంతాలను సేకరించుకున్నాడు. వాటిని వ్యక్తిత్వ వికాసానికి అనుగుణంగా mould చేసుకోసాగాడు.
~
(పూర్తి ఎపిసోడ్ని సంచికలో చదవగలరు)
https://sanchika.com/srimadramaramana-pds-serial-17/
అంత గరుత్మంతుండు వినయాంతరంగుండై వారికి ఎదురేగ
ఉ.:
బంగరు వన్నె కాంతిగల పక్షములన్, అమరాభిమానమున్
రంగరినట్టి దెందమున, రాజితమౌ హరిచందనంబు తోన్
అంగము వెల్గ, భూషణచయంబు చలింప ప్రియంపు మాటలన్
ఇంగిత మొప్ప వారి హరి జేరగ దోడ్కొని పోయె, బ్రీతుడై
~
(పూర్తి ఎపిసోడ్ని సంచికలో చదవగలరు)
https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-24/