గోవాడ క్రియేషన్స్ వారి ఏక పాత్రాభినయ స్క్రిప్ట్ పోటీలో, నా రచన, 'ద్రౌపది' ఎంపికయింది. సంబంధిత సమాచారం.
Click on the image to view in bigger size
కథా నవలా సాహిత్యం - పద్యాలు - కవితలు - వ్యాసాలు - నాటికలు - కాలమ్స్ - సంగీతం - సినిమాలు - జీవితం!
గోవాడ క్రియేషన్స్ వారి ఏక పాత్రాభినయ స్క్రిప్ట్ పోటీలో, నా రచన, 'ద్రౌపది' ఎంపికయింది. సంబంధిత సమాచారం.
Click on the image to view in bigger size
డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 21వ, చివరి భాగం సంచికలో చదవండి.
~
వైనతేయ ముకుళిత హస్తాలతో సభకు నమస్కరించాడు. తెల్లని పైజమా, జుబ్బా, ధరించాడు. నుదుట గంధం, కుంకుమ. తలకు ఒక ఎర్రని పట్టీ. మెడలో పగడాల దండ. అతని ముఖంలో తేజస్సు. జ్ఞానజనితమైన తేజస్సు అది.
“ఐ ప్రొప్యూజ్లీ థాంక్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది మెర్కురీ థియేటర్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ప్రిస్టీజియస్ మిషన్. ఐ ఇంట్రడ్యూస్ అవర్ గురు అండ్ హార్మోనిస్ట్ శ్రీ దస్తగిరి అండ్ అవర్ తబలిస్ట్ శ్రీ జయరాములు, హు విల్ అసిస్ట్ మీ విత్ దైర్ ఇన్స్ట్రుమెంట్స్. లెట్ మీ ప్రే అవర్ లార్డ్ గణేశ ఫస్ట్. టు గెట్ దిస్ హెర్యులియన్ టాస్క్ ఫుల్ఫిల్డ్, అన్-అబ్రస్టవ్లీ!” అని ‘శుక్లాంబరధరం’ శ్లోకాన్ని ‘హంసధ్వని’ లో పాడాడు.
~
(పూర్తి ఎపిసోడ్ని సంచికలో చదవగలరు)
https://sanchika.com/srimadramaramana-pds-serial-21/
అంత, వసంతం బంతంబు కాజొచ్చెను. వేసవి ప్రవేశించి తన ఋతుధర్మమును నిర్వర్తింప సాగెను.
కం:
తేటులు లతలను వీడెను
పాటలముల నాశ్రయించె మధువది కరవై
దీటగు యమ్ముల పోలిక
కోటిగ కనిపించె మల్లెకొమ్మల మొగ్గల్
~
(పూర్తి ఎపిసోడ్ని సంచికలో చదవగలరు)
https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-28/
విశ్వావసు ఉగాది పండుగ సందర్భంగా వ్రాసిన ప్రత్యేక రచన.
పూర్తి కథనం సంచికలో చదవవచ్చు.
ఆ మధ్య మా దగ్గర బంధువు ఒకాయనకు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి, రెండు స్టెంట్స్ వేయించుకున్నాడట. కానీ ఆ విషయం బంధువులెవ్వరికీ తెలియకుండా వాళ్ళు జాగ్రత్తపడ్డారు. ఎందుకో మరి? ‘సంసారం గుట్టు, వ్యాధి రట్టు’ అని కదండీ మన పెద్దలు చెప్పింది? ఈమధ్య మానవ సంబంధాలు తూతూ మంత్రంగా తయారైనాయి. దీనికి తోడు అతి గోప్యాలు! మా పరిచయస్థులొకరు మా యింటికి వచ్చారొక రోజు. ఆయనకు కాఫీ ఇవ్వాలి కదా! మా శ్రీమతి, “సార్, మీకు చక్కెర వేయచ్చునా.. లేక..” అన్నది. భారత్ మధుమేహ రాజధాని గదా! అందుకాయన. “అబ్బే! నాకు షుగర్ అస్సలు లేదమ్మా! కాని పంచదార వేయకండి” అన్నాడు. ‘ఇదేదో విరోధాభాసాలంకారంలా ఉందే?’ అని అనుకున్నాను. లేక ముందుజాగ్రత్తేమో! తర్వాత ఎవరో చెప్పారు, ఆయన ‘వెరీ వెరీ స్వీట్ బోయ్’ అని, ఇన్సులిన్ కూడా తీసుకుంటాడని! ఎందుకీ గోప్యాలు!
ప్రఖ్యాత వ్యాసరచయిత ఫ్రాన్సిస్ బేకన్, ‘ఆఫ్ సిమ్యులేషన్ అండ్ డిస్సిమ్యులేషన్’ అనీ ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. ‘దాపరికం, బహిర్గతం’ అన్న మాట! కాని లోతుగా వెళితే, డిస్సిమ్యులేషన్ అంటే మన ఆలోచనలను, విషయాలను దాచి ఉంచడం. సిమ్యులేషన్ అంటే ఇతరులను మోసగించడం కోసం, ఒక కపటచిత్రాన్ని ఆవిష్కరించడం.
తెనాలి రామకృష్ణుడు మహాకవి. కాని ఆయనను ‘వికటకవి’గా ముద్ర వేశారు. ఆయన హస్యచతురతను రకరకాల కథలుగా సృష్టించారు. కల్పితాలయినా అవి బాగా ప్రాచుర్యం పొందాయి. బ్లడ్ ఈజ్ థిక్కర్ దేన్ వాటర్! ఆయన పాండిత్యం కంటే ఇవే చాలామందికి తెలుసు, మధ్యలో తెనాలాయన ఎందుకు? కొంపదీసి మీది తెనాలా? అనుకుంటున్నారా? కొంపతీయకున్నా, మాది తెనాలి కాదండోయ్! దాచమని అత్యంత గోప్యంగా చెప్పిన విషయాన్ని ఆయన సోషియల్ మీడియాలో ఎంత విస్తృతంగా ప్రచారం చేశాడో చూడండి! “అప్పుడు సోషియల్ మీడియా ఎక్కడుంది? పోదురూ! బడాయి!” అంటున్నారా! అది ఎప్పుడూ ఉంది: ఏమంటే రూపం వేరు!
తెనాలివారు ఒకసారి రాణీగారి మందిరానికి వెళ్లాడు. ఆయనకు రాజకుటుంబంతో క్లోజ్ రిలేషన్స్ ఉండేవి! నేరుగా లోపలికి వెళ్లగలిగే చనువు, చొరవ ఉన్నాయి. సరిగ్గా అప్పుడు, రాణీగారు మోచేతుల మీద విపరీతంగా గోక్కుంటున్నారు. రాణీగారయితే గొప్పా ఏం? దురదలకు అవన్నీ తెలియవు. ఆమె తెనాలి వారితో “స్వామీ! ఈ దురదలతో చచ్చే చావయింది. దయచేసి ఈ విషయం ఎక్కడా అనకండి!” అన్నది. “మహారాణి!
మీరంతగా చెప్పాలా?” అన్నాడు. తర్వాత ఆమె దేవాలయానికి బయలుదేరుతూ, ఈయననూ రమ్మంది. సింగిల్ గుర్రం పూన్చిన చిన్నవాహనంలో ఆమె వస్తుండగా, పరిజనులు, సైనికులు, ముందూ వెనుకా! ఇంతలో వికటకవిగారు గుర్రం మూతికి తన అంగోస్త్రం కట్టారు. బండికి పరదాలు! ఒక రాజ సేవకుడు అడిగాడు, “స్వామీ! ఎందుకలా కట్టారు?” అని. వికటకవి అతని చెవిలో రహస్యంగా చెప్పాడు “రాణిగారికి దురదలు! ఎవ్వరికీ చెప్పొద్దన్నారు. గుర్రం ఏమయినా పొరపాటున ఎవరికైనా చెబుతుందేమో అని ఈ జాగ్రత్త! నీవు కూడా ఎవ్వరితో అనకు” అన్నాడు. ఆయన ఇదే మాట ఇంకొకాయనతో అన్నాడు. ఇలా మొత్తం అందరికీ తెలిసిపోయింది. సోషియల్ మీడియా చాలా పవర్ఫుల్.
ప్రాన్సిస్ బేకన్ గారు దాపరికాన్ని రకరకాలుగా పేర్కొన్నారు. మొదటిది ‘సీక్రెసీ’. తన భావాలు ఎవరికీ చెప్పడు. ఇది అంత హానికరం కాదట. ఇది కొన్నిసార్లు అవసరం కూడానట. రెండవది ‘హిపోక్రసి’. అంటే తనను ఇంకో రకంగా (మోసపూరితంగా) చూపించుకోవడం. మరీ ఎక్కువ దాపరికం మనుషుల మధ్య విశ్వాసాన్ని దెబ్బతీస్తుందట.

‘ఆడవారి నోట్లో నువ్వు గింజ నానదు’ అని నానుడి. పాపం ప్రతీదానికి వాళ్లనెందుకండీ ఆడిపోసుకుంటారు? ఎందుకు నానదంటే నానే లోపు దాన్ని ఇతరులకు చేరవేస్తారనేమో! అది వారి బోళాతనాన్ని, దాపరికం లేని గుణాన్ని చూపిస్తుందంటా నేను! నేనసలే స్త్రీ జన పక్షపాతినని మీకు ఇదివరకే మనవి చేసి ఉన్నా! సెల్ఫోన్లు వచ్చింతర్వాత, ఆడవారి ‘విషయ బహిర్గత ప్రావీణ్యం’ నాలుగు రెట్లు పెరిగింది. అయినా వారికీ కాలక్షేపం కావాలి కదా! తనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు ‘షేర్’ (సోషయల్ మీడియా భాషండోయ్!) చేస్తే తప్పులేదు. కాని, ‘కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత’ అన్నట్లుగా తమ సృజనాత్మకతను జోడించి, విషయానికి మసాలా దట్టించి వదలకూడదు. ఒకావిడ ఒక బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చింది. అమ్మాయి పేరును బట్టి అది కులాంతర వివాహం అని అర్థమైంది. ఇక ఈవిడ తన ‘కిత్ అండ్ కిన్’ అందరికే ఒకటే కాల్సు! దాన్ని మతాంతర వివాహంగా మార్చింది. దానికి ముందు ఉభయ కుటుంబాల్లో ఎన్ని గొడవలైనాయో (ఏ గొడవలూ అవలేదు, శుభ్రంగా ప్రేమించుకున్నారు, ఉభయులూ అంగీకరించారు) వివరించింది. నువ్వుగింజ నానకపోగా, బాగా ఉబ్బిందన్నమాట!
ఒక్కటి మాత్రం నిజం మాస్టారు. సత్యం ‘ఇంగువ కట్టిన గుడ్డ’ లాంటిది. దాన్ని ఎంత దాచాలనుకున్నా దాని సువాసన దాన్ని పట్టిస్తుంది. అబద్ధం అతి త్వరగా వ్యాపిస్తుంది. ఈ ఆధునిక సమాజంలో హిపోక్రసీ లేకుండా జీవించడం కష్టం. ఒక సూపర్ హిట్ సినిమాను, అది ఎంత చెత్తగా ఉన్నా, బాగులేదని చెప్పలేం. అలా ఉంది పరిస్థితి. సాధ్యమైనంత వరకు ఓపెన్ మైండ్తో ఉందాం! పదిమందికి తెలిస్తే మనకు మంచి జరుగుతుందంటే చెబుదాం! అతి గోప్యం హానికరం! అదన్నమాట!
డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 20వ భాగం సంచికలో చదవండి.
~
"అసూయాపరుడి మానసిక స్థితిని దుర్యోధన సార్వభౌముడిలా చెప్పాడు -
‘కంటికి నిద్రవచ్చునే సుఖంబగునే రతికేళి జిహ్వకున్
వంటకమిందునే, ఇతర వైభవముల్ పదివేలు మానసం
బంటునె, మానుషంబుగలయట్టి మనుష్యున కెంతవానికిన్
గంటకుడైన శాత్రవు డొకండు తనంతటివాడు గల్గినన్’
ఈ పద్యం శ్రీనాథునిది. ‘కాశీఖండం’ అనే కావ్యంలో వింధ్యపర్వతంతో చెప్పించాడు మహాకవి. దానిని యన్.టి.ఆర్ గారు తమ ‘దానవీర కరకర్ణ’లో వాడుకున్నారు, సందర్భోచితంగా!”
సభికులు అతన్ని అభినందించారు. ఒథెల్లోను తీసుకొచ్చి శ్రీనాథునితో, NTR తో ముడిపెట్టినందుకు.
~
(పూర్తి ఎపిసోడ్ని సంచికలో చదవగలరు)
https://sanchika.com/srimadramaramana-pds-serial-20/
అనుకంపాపూరితుడైన అబ్జనాభుండు సురలతో నిట్లు పలికెను.
ఉ.:
వింటిని దైత్యు దుర్మదపు వికృత చేష్టలు, దుష్టకృత్యముల్
మింటను భాస్కరోదయము మించిన చీకటి బాపునట్లు, నా
కంటకు పాపముల్ పగిలి కర్మఫలంబది పండువేళ, మీ
కంటిన వాని పీడ తొలగన్ వధియించెద, నోర్పు పట్టుడీ!
~
(పూర్తి ఎపిసోడ్ని సంచికలో చదవగలరు)
https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-27/