అంకముఁజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్గబళింపఁబోయి యా
వంక కుచంబుఁగాన కహివల్లభహారముగాంచి వే మృణా
ళాంకుర శంకనంటెడి గజాస్యునిఁగొల్తు నభీష్టసిద్ధికిన్
('మనుచరిత్ర'లో అల్లసాని పెద్దన చేసిన విఘ్నేశుడి ప్రార్థనా పద్యం)
తాత్పర్యం:
బుజ్జి గణపయ్య వాళ్లమ్మ ఒడిలో కూర్చుని పాలు తాగుతున్నాడు. పిల్లలు ఒక వైపు తాగుతూ, రెండో వైపు రొమ్ముతో ఆడుకుంటారు కదా! అలాగే ఆయన కూడా చేద్దాం అనుకుంటే, అటువైపు రొమ్ము లేదు. పైగా పాము ఉంది! అంటే అర్ధనారీశ్వరతత్త్వంలో రెండో సగం శివుడు మరి. దాన్ని తామరతూడు అనుకొని లాగే విఘ్నపతికి నమస్కారం అంటున్నారు అల్లసాని పెద్దన. మనుచరిత్ర లోని పద్యమిది. ఎలాంటి అయిడియా వచ్చిందో చూడండి, ఆ కవివర్యునికి!
(ఇమేజ్ సోర్స్: ఇంటర్నెట్)
No comments:
Post a Comment