డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 5వ భాగం సంచికలో చదవండి.
~
“వీడు ఉండటానికి బాలుర సంక్షేమ వసతిగృహం ఏదైనా..” అని దస్తగిరి సారు అంటుండగానే శర్మగారు కలుగజేసుకొని “ఎంత మాటన్నావు నాయనా, వాడు హాస్టల్లో ఉంటే నా వద్ద విద్య నేర్చుకునేదెప్పుడు? ఈ రోజు నుంచి వాడు మా దగ్గరే ఉంటాడు. మేం తిన్నదే తింటాడు. పెరట్లో ఒక కొట్టుగది నిరుపయోగంగా ఉంది. మొన్ననే దానిని మా వల్లి శుభ్రం చేయించి పెట్టింది. అందులోనే వాడుండబోతున్నాడు. రెండేళ్లు ఎంతలో గడుస్తాయి దస్తగిరీ! తర్వాత తిరుపతికి వెళ్లాల్సిందేనాయె” అన్నారాయన. ఆయన విశాల దృక్పథం తెలియక హాస్టలు ప్రస్తావన తెచ్చినందుకు దస్తగిరి సారు పశ్చాత్తాప పడినాడు. శర్మగారు కొంచెం మనసు నొచ్చుకున్నట్లనిపించిది.
“క్రమించండి, స్వామి! మహోన్నతమైన మీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేకపోయినాను” అన్నాడు.
కథా నవలా సాహిత్యం - పద్యాలు - కవితలు - వ్యాసాలు - నాటికలు - కాలమ్స్ - సంగీతం - సినిమాలు - జీవితం!
Monday, December 9, 2024
నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 5వ భాగం సంచికలో
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment