Tuesday, February 25, 2025

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 23వ భాగం లింక్

“కావున మనమందరము వైకుంఠవాసుడైన విష్ణుని పాదపద్మంబుల నాశ్రయింతము. మన దుస్థితి యంతయు నా కేశవునకు విన్నవింతము. ఆయన చెప్పిన తెఱంగున నడచుకొందము” అని బృహస్పతి దివిజులకు ఎఱింగించెను. ఇట్లు దేవశ్రవుని వలన గాలవుండు సకలంబును తెలిసికొని సంతోషము పొందెను.
అంబురుహ వృత్తము:
ఆవల నీవల నంతయు గాచెడి ఆర్తబంధు! పరాత్పరా!
నీ వలనన్ సకలంబును నిల్చును నీవె దిక్కు, నిరంజనా!
కావుము దేవతలందరి నీ దయ కార్యకారణహేతువై
చావుయె లేని వరంబును బొందిన శత్రు దున్ముము మృత్యువై
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-23/

No comments:

Post a Comment