“కావున మనమందరము వైకుంఠవాసుడైన విష్ణుని పాదపద్మంబుల నాశ్రయింతము. మన దుస్థితి యంతయు నా కేశవునకు విన్నవింతము. ఆయన చెప్పిన తెఱంగున నడచుకొందము” అని బృహస్పతి దివిజులకు ఎఱింగించెను. ఇట్లు దేవశ్రవుని వలన గాలవుండు సకలంబును తెలిసికొని సంతోషము పొందెను.
అంబురుహ వృత్తము:
ఆవల నీవల నంతయు గాచెడి ఆర్తబంధు! పరాత్పరా!
నీ వలనన్ సకలంబును నిల్చును నీవె దిక్కు, నిరంజనా!
కావుము దేవతలందరి నీ దయ కార్యకారణహేతువై
చావుయె లేని వరంబును బొందిన శత్రు దున్ముము మృత్యువై
~
(పూర్తి ఎపిసోడ్ని సంచికలో చదవగలరు)
No comments:
Post a Comment